ఖమ్మం వార్తలు

అశ్వరావు పేటలో చిరుత పులి సంచారం ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో చిరుత పులి సంచరిస్తుందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం జూపల్లి వెంకట రామారావు అనే రైతు, పేట మాలపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటకు వెళ్ళగా చిరుత పులి కనిపించినట్లు చెబుతున్నాడు. రామారావు వెంటనే వచ్చి విషయాన్ని స్థానికులకు తెలపడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికార్లు ఘటనా స్థలానికి చేరుకొని కొబ్బరి తోటలో పులి పాద ముద్రలను గుర్తిస్తున్నారు.

Related posts

19న ఖమ్మం నగరం హవేలీలో సిపిఎం కార్యాలయం సత్తెనపల్లి భవన్ ప్రారంభోత్సవం

Ram Narayana

రఘునాథపాలెం మండలానికి మహర్దశ మంచుకొండ ఎత్తిపోతల పథకం…మంత్రి తుమ్మల

Ram Narayana

ఈనెల 25 న ఖమ్మంలో భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభ …-నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ …

Drukpadam