ఖమ్మం వార్తలు

అశ్వరావు పేటలో చిరుత పులి సంచారం ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో చిరుత పులి సంచరిస్తుందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం జూపల్లి వెంకట రామారావు అనే రైతు, పేట మాలపల్లి సమీపంలోని తన కొబ్బరి తోటకు వెళ్ళగా చిరుత పులి కనిపించినట్లు చెబుతున్నాడు. రామారావు వెంటనే వచ్చి విషయాన్ని స్థానికులకు తెలపడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికార్లు ఘటనా స్థలానికి చేరుకొని కొబ్బరి తోటలో పులి పాద ముద్రలను గుర్తిస్తున్నారు.

Related posts

భరతమాత ముద్దుబిడ్డ ,మార్క్సిస్ట్ మేధావి సీతారాం ఏచూరి ! ఎస్ వీరయ్య

Ram Narayana

పామాయిల్‌లో అంతర పంటగా పసుపు, మంత్రి తుమ్మల ప్రయోగం సూపర్‌ హిట్..

Ram Narayana

అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి….

Ram Narayana