పాడి రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు బీమాను ప్రవేశపెట్టింది. పశు బీమా ప్రీమియం 80% రాయితీ ఉంటుంది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 80% శాతంచెల్లిస్తుంది. ఈ బీమా మూడు సంవత్సరాలు ఉంటుంది. పశువులకు బీమా 30 వేల రూపాయలు ఉంటుంది. 384 రైతు చెల్లిస్తే 1534 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. మూడేళ్లు పాటు బీమా వర్తిస్తుంది. పశువులు ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే నష్ట పరిహారం కింద బీమా 30,000 రూపాయలు వర్తిస్తుందని పశు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ పశు బీమా అనేది గొర్రెలు, మేకలకు కూడా వర్తిస్తుంది. ఈ గొర్రెలు, మేకలకు కూడా 80% రాయితీ ఉంటుంది. ప్రతి గొర్రెల, మేకల యజమానులు 50 నుంచి 100 గొర్రెల వరకు ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని పశు వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రీమియంలో 20% మాత్రమే రైతు చెల్లిస్తే సరి పోతుందని తెలుపుతున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు అవి చనిపోయినట్లయితే 6000 రూపాయలు ఇన్సూరెన్స్ లభిస్తుంది.
previous post