ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

‘జగన్ 2.0 – మావిగన్ 2029’ .. జగన్ ఇంటి ముందు ‘మావిగన్’ ఫ్లెక్సీ…

తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ‘మావిగన్’ ప్లెక్సీ వెలిసింది.  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGUN) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీపై ఆసక్తికర నినాదాలను పొందుపరిచారు. ముఖ్యంగా “జగన్ 2.0 – మావిగన్ 2029” అనే నినాదం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ‘మావిగన్’ ప్రతిపాదనను పార్టీ ప్రధాన అజెండాగా తీసుకువెళ్లబోతున్నట్లు సంకేతాలిచ్చారు. “యువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్” అంటూ హైలైట్ చేశారు. “ఒక పార్టీ.. ఒక జెండా.. ఒక అజెండా” అని రాసి ఉండటం ద్వారా రాజధాని విషయంలో వైసీపీ కేడర్ అంతా ఒకే మాటపై ఉందనే సందేశాన్ని పంపారు.

రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన తరుణంలో, జగన్ నివాసం వద్ద ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ద్వారా… అమరావతికి వైసీపీ పూర్తి వ్యతిరేకం అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

Related posts

ఏపీలో శాంతిభద్రతలపై మాజీ సీఎం జగన్ నాయకత్వంలో దేశరాజధాని ఢిల్లీలో ధర్నా …

Ram Narayana

చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి …సజ్జల

Ram Narayana

పార్టీ అవకాశమిస్తే రాజ్యసభకు వెళతా.. మనసులో మాట బయటపెట్టిన యనమల!

Ram Narayana