ఖమ్మం వార్తలు

బెండ చేనులు మేసిన 300 మేకలు…చనిపోయిన 65 మేకలు ..

బెండ చేనులు మేసిన 300 మేకలు…చనిపోయిన 65 మేకలు ..
పురుగు మందు కొట్టడంతోనే ఈ దుర్ఘటన
హుటాహుటిన ఖమ్మం పశువైద్యశాలకు తరలింపు ..
చికిత్స అందించిన వైద్యులు

ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాలో మేతకు వెల్లిన 300మేకలు ఒక్కసారిగా కుప్పకూలిపొయాయి. వాటిలో 65 మేకలు ఇప్పటికే మరణించాయి…ఈ పరిణామంతో గ్రామస్తులు హతాశులయ్యారు…మేకల యజమానులు లబోదిబోమంటున్నారు …

బెండ చేను లోనే సుమారు 50 మేకలు చనిపోగా.. ఖమ్మంలోని జిల్లా పశువైద్యశాలలో 15 మేకలు చనిపోయాయి. మరో 50 మేకలకు చికిత్స అందిస్తున్నారు.
బెండకాయ చేనులో రసాయనిక మందులు పిచికారి చేయడం వల్ల అవి తిన్న మేకలు చనిపోయి ఉంటాయని రైతులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 65 మేకలు చనిపోయాయని ఇంకా పొలంలో సైతం చెట్లల్లో చనిపోయిన మేకలు కనిపిస్తున్నాయని హాస్పిటల్లో సైతం చాలావరకు మేకలు అస్వస్థత గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

Related posts

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటి

Ram Narayana

అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పంచాయతీ…

Ram Narayana

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

Ram Narayana