- ఎర్రవల్లి ఫామ్హౌస్లో జారిపడి గాయపడ్డ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
- యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా
- కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
- పల్లా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మాజీ సీఎం

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుంది …ఎవరు మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పడం కష్టమౌతుంది …గత కొన్ని రోజులుగా బీఆర్ యస్ లోని కొందరు నేతలు ప్రత్యేకంగా తన అన్న కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేసిన కవిత నేడు కేసీఆర్ ను కలిశారు …గతంలోనే ప్రత్యర్థి పార్టీలు అన్నట్లు వారి మధ్య జరుగుతుంది ,ఇంటి గోడోవేనా అనే అనుమానాలకు బలం చేకూర్చుతూ కవిత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకు వెళుతున్న సందర్భంగా భేటీ అయ్యారు …అక్కడ నుంచి ఆయన్ను అనుకరించారు ..కమిషన్ విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ నిన్న తన ఫామ్ హౌస్ లో క్రిందపడి దెబ్బలు తగిలి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లగా ఆయనతోపాటు కవిత కూడా వెళ్లారు .. అయితే ఆమె మొదటి నుంచి పార్టీని ఎక్కడ విమర్శించలేదు …పైగా కేసీఆర్ నాయకత్వమే పార్టీకి శరణ్యమని బలంగా చెపుతున్నారు …అంటే అన్న నాయకత్వాన్ని ఆమె అంగీకరించడంలేదనే అభిప్రాయాలు ఉన్నాయి..కేసీఆర్ వెంట హరీష్ రావు కూడా ఉన్నారు …
బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను పరామర్శించారు.
బుధవారం బీఆర్కే భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. విచారణ ముగిసిన వెంటనే ఆయన నేరుగా యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కేసీఆర్ వెంట బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు ఉన్నారు. పల్లా త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు.