జాతీయ వార్తలు

టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల వ్యవహారం.. స్పందించిన చంద్రశేఖరన్

టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లో జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారంపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని అన్నారు. ఈ ఘటను తీవ్రంగా పరిగణించామని, అందుకే ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామని అన్నారు.

వాస్తవాలను నిర్ధారించడానికి, ఇందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించడానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి అనుచిత ప్రవర్తనను టాటా గ్రూప్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

కాగా, టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు, మతమార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.

Related posts

ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ

Ram Narayana

అసోంలోని ఆ గ్రామమంతా ఒకే కుటుంబం… 1200 మంది ఓటర్లు ఉన్నారు!

Ram Narayana

హార్దిక్ పాండ్యాపై పోలీసులకు ఫిర్యాదు.. చిక్కుల్లో టీమిండియా ఆల్‌రౌండర్…

Ram Narayana