తెలుగు రాష్ట్రాలు

తిరుమల కొండపై అక్రమ వసూళ్లు… ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ…

తిరుమలలో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఉద్యోగిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కఠిన చర్యలు తీసుకుంది. లగేజీ సెంటర్‌లో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగించింది.

తిరుమలలోని లగేజీ డిపాజిట్ కేంద్రంలో నరసింహారెడ్డి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. విచారణ జరిపిన అధికారులు, ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. వాస్తవానికి టీటీడీ భక్తులకు లగేజీ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ సేవలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని భక్తులను కోరింది. అలాంటి ఘటనలు ఎదురైతే, టీటీడీ విజిలెన్స్ కంట్రోల్ నంబర్ 9866898630కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. భక్తులకు అందించే ఉచిత సేవల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది.

Related posts

ఒక్క ఇంజెక్షన్ రూ.16 కోట్లు… పునర్వికను ఆదుకోండి: మంచు మనోజ్

Ram Narayana

చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ కు జగన్ ఫోన్!

Ram Narayana

జిమ్ లో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్!

Ram Narayana