ఆంధ్రప్రదేశ్

ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా!

  • సర్వీస్ ఉండగానే ఐపీఎస్‌కు గుడ్ బై చెప్పిన సిద్ధార్థ్ కౌశల్
  • డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఐపీఎస్ అధికారి
  • వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని వెల్లడి

సిద్దార్థ కౌసిల్ రాజీనామా వెనక కారణం ఏమై ఉంటుందబ్బా…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి సిద్దార్థ కౌసిల్ రాజీనామా చేశారు …తన రాజీనామాకు గల కారణాలను కూడా ఆయన వివరించారు …తాను ఎవరి వత్తిడికి, వేధింపులకు బయపడి రాజీనామా చేయడంలేదని ఇది కేవలం తన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు ..తన కుటుంబసభ్యుల కోరిక కూడా ఇదేనని చెప్పారు …కొందరు ప్రచారం చేస్తున్నట్లు తనకు ఎవరినుంచి వత్తిళ్లు ,బెదిరింపులు లేవని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు …20 సంవత్సరాల తన పదవి కాలంలో ఏపీలో సేవ చేసే అదృష్టం లభించిందని పేర్కొన్నారు …ఏపీ తన సొంత ఇల్లు లాంటిదని అన్నారు …భవిష్యత్ లో ఏమి చేయాలనిదేమి ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు ..అయితే ఆయన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆసక్తికర చర్చిలు జరుగుతున్నాయి…అసలు రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు ఏమిటబ్బా అనే కోణంలో పలువురు ఆరా తీస్తున్నారు …

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన సర్వీసుకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో అందించిన సేవలకు ఆయన ముగింపు పలికారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

చాలాకాలంగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని సిద్ధార్థ్ కౌశల్ తన ప్రకటనలో తెలిపారు. తన భవిష్యత్ జీవిత లక్ష్యాలకు, కుటుంబ సభ్యుల ఆకాంక్షలకు అనుగుణంగానే సర్వీసు నుంచి వైదొలగుతున్నట్లు వివరించారు. కొన్ని మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్లుగా వేధింపులు లేదా బాహ్య ఒత్తిళ్ల కారణంగా తాను రాజీనామా చేశానన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి. నా నిర్ణయం పూర్తిగా స్వతంత్రమైనది, వ్యక్తిగతమైనది, స్వచ్ఛందమైనది” అని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని కౌశల్ పేర్కొన్నారు. “ఐపీఎస్ అధికారిగా పనిచేయడం నా జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన, విలువైన ప్రయాణం. నేను ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ నా సొంతిల్లుగానే భావించాను. ఇక్కడి ప్రజలు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానంలో ఉంటారు” అని ఆయన అన్నారు. తన వృత్తి జీవితంలో తనకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీనియర్ అధికారులకు, సహోద్యోగులకు, సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మీ మద్దతు, విశ్వాసమే నన్ను ఒక అధికారిగా, వ్యక్తిగా తీర్చిదిద్దాయి” అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కొత్త మార్గాల్లో సమాజానికి సేవ చేస్తానని సిద్ధార్థ్ కౌశల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సిద్ధార్థ్ కౌశల్, గతంలో కృష్ణా, ప్రకాశం, వైస్సార్ కడప జిల్లాల ఎస్పీగా, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన అధికారిక ప్రకటనలో భవిష్యత్ ప్రణాళికల గురించి ఏమీ ప్రస్తావించనప్పటికీ, ఢిల్లీ కేంద్రంగా ఒక కార్పొరేట్ సంస్థలో చేరవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Related posts

ఏపీ దశ మార్చనున్న హైస్పీడ్ రైల్వే.. రూ.5.42 లక్షల కోట్లతో రెండు భారీ కారిడార్లు!

Ram Narayana

కార్పొరేట్ ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సమస్యను వివరించిన సత్య నాదెళ్ల..

Drukpadam

అమ్మాయిల పెళ్లి వయసు 21 …చట్టం చేయనున్న కేంద్రం!

Drukpadam