తెలంగాణ వార్తలు

స్థానిక ఎన్నికల్లో 30 ఏళ్ల నిబంధనకు స్వస్తి.. ఇద్దరు పిల్లల నిబంధన రద్దు..!

  • స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపునకు వేగంగా అడుగులు
  • రేపటి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయానికి అవకాశం
  • ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
  • గవర్నర్ ఆమోదిస్తే రానున్న పంచాయతీ ఎన్నికల్లోనే అమలు
  • ఇప్పటికే మంత్రి సీతక్క సంబంధిత ఫైల్‌పై సంతకం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు అనర్హులు అనే 30 ఏళ్ల నాటి నిబంధనను తొలగించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గురువారం జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే, రానున్న పంచాయతీ ఎన్నికల నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు. ఈ నేపథ్యంలో చట్టసవరణను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. మంత్రి సీతక్క ఈ ఫైల్‌పై సంతకం చేయగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత దీనిని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే, ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.

కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో 1995లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇది అమల్లో ఉంది. అయితే, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు, కుటుంబ నియంత్రణపై ప్రజల్లో పెరిగిన అవగాహన, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం ఏపీలో కూడా ఇదే తరహా చట్టసవరణ చేశారు. ఈనెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టేందుకు కసరత్తు పూర్తి చేసింది.

‘ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు’ ఫైల్ పై సీఎం సంతకం

  • కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఫైల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) ని సవరించేందుకు ఇటీవల కేబినెట్​ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన ఫైల్ పై తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, ఆ వెంటనే సీఎం సంతకం చేశారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఫైల్​ను ఆమోదించిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీచేయనున్నట్లు చెబుతున్నారు….

Related posts

వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం!

Ram Narayana

ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కవుల ,కళాకారుల ఐక్య వేదిక ఏర్పాటు …!

Ram Narayana

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి!

Ram Narayana