ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య…

  • ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి
  • హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను అనుమానిస్తున్న పోలీసులు
  • ఘటనను తీవ్రంగా ఖండించి, నిరసనలకు పిలుపునిచ్చిన జర్నలిస్ట్ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది.

వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో వి. కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో నివసిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related posts

కోలుకున్న పువ్వాడ నాగేశ్వరరావు …!

Drukpadam

పవన్ పై కించపరిచే పోస్టులు … ముగ్గురు అరెస్ట్

Ram Narayana

రెండుతరాల జర్నలిస్టుల మద్య పోటి పెట్టడం తగదు…

Drukpadam