Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

నస్రల్లాను తుదముట్టించిన ఆపరేషన్ జరిగిందిలా..

  • హిజ్బొల్లా చీఫ్ టార్గెట్ గా బాంబు దాడులు
  • విమానంలో అమెరికా వెళుతూ అధికారులతో నెతన్యాహు చర్చలు
  • ఐరాస లో ప్రసంగానికి ముందు అనుమతినిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని

‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’.. హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఇది. నస్రల్లా కదలికలపై నెలల తరబడి నిఘా పెట్టిన ఇజ్రాయెల్.. ఎప్పటికప్పుడు సమాచారం సేకరించింది. పక్కాగా ప్లాన్ చేసి బాంబుల వర్షం కురిపించి నస్రల్లాను అంతం చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్ పాల్గొంది. హట్‌జెరిమ్‌ ఎయిర్‌బేస్‌ కేంద్రంగా పనిచేసే ఈ స్క్వాడ్రన్ ను ‘హామర్స్’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో సగం మంది రిజర్విస్టులే.. అంటే పూర్తిస్థాయిలో సైనికులు కాదు. ప్రత్యేక సందర్భాలు, ఆపరేషన్లు చేపట్టినపుడు ఇజ్రాయెల్ బలగాలు వీరి సేవలను ఉపయోగించుకుంటాయి. మిగతా సమయాల్లో వారు సాధారణ జీవితం గడుపుతుంటారు.

నస్రల్లా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులను వాయిదా వేస్తూ వచ్చింది. నెతన్యాహు మంత్రివర్గంలో కొంతమంది వ్యతిరేకించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ పై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, సోమవారం మొదలైన ఆపరేషన్‌ ప్లానింగ్‌ బుధవారం జోరందుకుందని సమాచారం. ఐరాస సమావేశాల కోసం నెతన్యాహు అమెరికా వెళుతూ విమానంలో కూడా దీనిపై చర్చలు జరిపారట.. ఇక న్యూయార్క్ లో జరిగిన జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న నెతన్యాహు.. సభలో ప్రసంగించే ముందు నస్రల్లాపై బాంబు దాడికి బలగాలకు అనుమతిచ్చారు.

లెబనాన్ లో నస్రల్లాపై దాడులు చేయడానికి హామర్స్ స్క్వాడ్రన్ ఎఫ్ -15 రామ్ ఫైటర్ జెట్స్ ను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కు కొత్త కమాండింగ్ ఆఫీసర్ ను నియమించారు. బ్రిగేడియర్ జనరల్ అమిచయ్ లెవనె పర్యవేక్షణలో హామర్స్ స్క్వాడ్రన్ ఆపరేషన్ న్యూ ఆర్డర్ చేపట్టింది. హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడులకు ఎఫ్ – 15 ఫైటర్ జెట్లు బయలుదేరి వెళ్లాయి. టార్గెట్ పై సెకనుకు రెండు బాంబుల చొప్పున 80 బాంబులను జార విడిచాయి. దీంతో క్షణాలలోనే ఆరు భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. అమెరికా సమకూర్చిన బాంబులనే ఈ దాడిలో వాడినట్లు తెలుస్తోంది. అమెరికాలో తయారైన బీఎల్ యూ -109 బాంబులకు జేడామ్ ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చి దాడి చేశారు. ఆపై సాయంత్రం వేళలో ఫైటర్ జెట్లు హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి.

హ‌త‌మైన న‌స్రల్లా స్థానంలో హిజ్బొల్లా కొత్త చీఫ్‌గా హ‌షీమ్ సఫియెద్దీన్.. 1990లలోనే నిర్ణయం

Hashem Safieddine to replace Hassan Nasrallah as Hezbollah chief
  • బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నస్రల్లా హతం
  • నస్రల్లాకు సఫియెద్దీన్ కజిన్
  • ఇద్దరూ ఒకేసారి హిజ్బొల్లాలో చేరిక
  • ఇజ్రాయెల్ దాడుల్లో సఫియెద్దీన్ కూడా మృతి చెందినట్టు తొలుత వార్తలు
  • వాటిలో నిజం లేదని పేర్కొన్న ‘రాయిటర్స్’

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా స్థానాన్ని హషీమ్ సఫియెద్దీన్ భర్తీ చేశాడు. హిజ్బొల్లాకు 32 ఏళ్లపాటు పనిచేసిన నస్రుల్లాకు సఫియెద్దీన్ కజిన్. ఇజ్రాయెల్ దాడుల్లో సఫియెద్దీన్ కూడా హతమైనట్టు నిన్న వార్తలు వచ్చాయి.  అయితే, అతడు బతికే ఉన్నాడని తాజాగా ‘రాయిటర్స్’ పేర్కొంది. 

సఫియెద్దీన్ కూడా నస్రుల్లాతోపాటే హిజ్బొల్లాలో చేరాడు. దక్షిణ లెబనాన్‌లో 1964లో జన్మించాడు. సఫియెద్దీన్ 1990లలో ఇరాన్‌లో చదువుకుంటున్నప్పుడే బీరుట్ పిలిపించారు. అప్పుడే అతడు హిజ్బొల్లాలో నంబర్ 2 అని, నస్రల్లా తర్వాత బాధ్యతలు చేపట్టేది అతడేనని డిసైడేపోయింది. 

అమెరికా 2017లో సఫియెద్దీన్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఇప్పుడు నస్రల్లా మృతితో అనుకున్నట్టుగానే హిజ్బొల్లా బాధ్యతలు స్వీకరించాడు. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లోనే 1997లో నస్రల్లా కొడుకు హదీ హతమవగా, తాజాగా నస్రల్లాతోపాటు అతడి కుమార్తె జైనాబ్ కూడా మృతి చెందారు. అయితే, జైనాబ్ మృతిని ధ్రువీకరించాల్సి ఉంది.

Related posts

ఫ్యామిలీ మెంబర్ స్పాన్సర్ వీసాకు ఆదాయ పరిమితిని 55 శాతం పెంచిన యూకే…

Ram Narayana

ఊహించని ఇబ్బందులు వస్తే ల్యాండింగ్ తేదీ మార్చేస్తాం: ఇస్రో శాస్త్రవేత్త

Ram Narayana

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా విదేశాంగ మంత్రి హెచ్చరిక

Ram Narayana

Leave a Comment