Ashwini Vaishnaw
జాతీయ వార్తలు

కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం

  • కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ప్రకటన
  • వివరాలు వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • కాంగ్రెస్ సర్వేల్లో పారదర్శకత లోపించిందని విమర్శ

దేశంలో కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేపట్టబోయే జాతీయ జనాభా లెక్కల సేకరణతో పాటే కులాల వివరాలను కూడా సేకరించనున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం, తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న కులగణన అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అధికారిక జనాభా గణాంకాల సేకరణ ప్రక్రియలోనే కులాల వారీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చేపడుతున్న కులాల సర్వేలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలలో పారదర్శకత కొరవడిందని కేంద్రం అభిప్రాయపడినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

Related posts

ఆ పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనైతే అయోధ్య వెళుతున్నా.. తేల్చి చెప్పిన హర్భజన్‌సింగ్

Ram Narayana

‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం!

Ram Narayana

పాక్ విచక్షణారహిత కాల్పులు… పది మంది భారత పౌరులు మృతి

Ram Narayana