ఆంధ్రప్రదేశ్

నందిగం సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్

తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైయిన మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు నందిగం సురేశ్ కు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. నందిగం సురేశ్ ను ఆదివారం ఉదయం అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం మంగళగిరి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న నందిగం సురేశ్ అనుచరులను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇతరులు ఎవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించ లేదు.

Related posts

వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివదేహానికి నివాళి అర్పించిన జగన్…!

Ram Narayana

తిరుపతిలో దారుణం.. మహిళను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడ్డ గ్యాస్ డెలివరీ బాయ్

Ram Narayana

అంగీకారం లేకుండా మహిళ పాదాలను తాకినా నేరమే: బాంబే హైకోర్టు!

Drukpadam