ఆంధ్రప్రదేశ్

మెడికల్ కాలేజీల పీపీపీపై రగడ.. వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’కి పోలీసుల బ్రేక్!

  • మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై తీవ్ర వివాదం
  • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసనకు పిలుపు
  • ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో ఆందోళన కార్యక్రమం
  • అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుమతి నిరాకరణ
  • రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ నేతల గృహ నిర్బంధం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఇవాళ ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమానికి పిలుపునివ్వగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, పలువురు వైసీపీ ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు.

రాష్ట్రంలోని నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడమే ఈ వివాదానికి మూలకారణం. అయితే, ఇది కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నమేనని వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. తమ హయాంలో (2019-24) 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించామని, వాటిలో ఐదు ఇప్పటికే తరగతులు కూడా మొదలుపెట్టాయని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని తాము అంగీకరించబోమని వారు స్పష్టం చేస్తున్నారు. 

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని కొత్త మెడికల్ కాలేజీల వద్ద నిరసనలు చేపట్టాలని వైసీపీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొనాల్సి ఉంది. అయితే, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ నేతలను ఇళ్ల నుంచి కదలకుండా కట్టడి చేస్తున్నారు.

Related posts

కెనడా, బ్రిటన్ దేశాల్లో ఖలిస్థాన్ పోస్టర్లు…ఆమోదయోగ్యం కాదన్న భారత్!

Drukpadam

ఆస్ట్రేలియా వీధుల్లో భారతీయులపై ఖలిస్థాన్ అనుకూల వాదుల దాడులు …!

Drukpadam

పలాసలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం…

Ram Narayana