ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జోగి రమేశ్ ఇంటిపై దాడి కేసు.. 11 మంది టీడీపీ నేతల అరెస్ట్…

  • నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేశ్
  • జోగి రమేశ్ ఇంటిపై దాడి చేసిన ఘటనలో 40 మందిపై కేసు నమోదు
  • అరెస్ట్ చేసిన 11 మందికి స్టేషన్ బెయిల్

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి చేసిన కేసులో 40 మంది టీడీపీ నేతలపై కేసు నమోదయింది. వీరిలో 11 మందిని అరెస్ట్ చేసి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెంటనే వీరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో… అంతా విడుదల అయ్యారు. 

నారా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో… టీడీపీ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆయన ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు విసిరి మంటలు రాజేశారు. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ వాళ్లు అయినా సరే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే, 40 మంది నేతలపై కేసులు నమోదు చేశారు. 

Related posts

రాజంపేటలో మిథున్ ,కిరణ్ కుమార్ రెడ్డి లమధ్య మాటల యుద్ధం….

Ram Narayana

నేనేమీ దేశం వదిలి పారిపోలేదు… ఎందుకు నోటీసులతో హడావుడి చేస్తున్నారు?: సజ్జల

Ram Narayana

సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం: ఉండవల్లి

Ram Narayana