Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేంద్ర బడ్జెట్ తో తగ్గేవి, పెరిగేవి… !

కేంద్ర బడ్జెట్ తో తగ్గేవి, పెరిగేవి… !

  • పలు రంగాల్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • దిగుమతులపై సుంకం పెంపు
  • చౌకగా మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు   

కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టారు. 2022-23 బడ్జెట్ తో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. మరికొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా, కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏమిటంటే…

ఇవి చౌకగా లభిస్తాయి..

  • మొబైల్ ఫోన్లు
  • మొబైల్ ఫోన్ చార్జర్లు
  • మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్ ఫార్మర్లు
  • వజ్రాలు (కట్ అండ్ పాలిష్డ్), రత్నాలు
  • పలు రకాల అనుకరణ ఆభరణాలు (ఇమిటేషన్ జ్యుయెలరీ)
  • పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్
  • మిథనాలు, మరికొన్ని రసాయనాలు
  • కెమెరా లెన్సులు
  • స్టీల్ స్క్రాప్
  • వ్యవసాయ పరికరాలు
  • దుస్తులు
  • పాదరక్షలు
  • విదేశీ యంత్ర సామగ్రి
  • తోలు వస్తువులు

ధరలు పెరిగేవి…

  • అనేక రకాల దిగుమతి వస్తువులు
  • విదేశీ గొడుగులు
  • క్రిప్టో లావాదేవీలు

Related posts

బిపిన్ రావత్ మరణం తీవ్ర వేదన కలిగిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ

Drukpadam

How One Designer Fights Racism With Architecture

Drukpadam

కేంద్రం ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా బీహార్ లో హింసాత్మక ఘటనలు!

Drukpadam

Leave a Comment