ఆంధ్రప్రదేశ్

విశాఖ సదస్సుకు వచ్చిన అతిథులకు గిఫ్ట్ ప్యాక్ లు!

విశాఖ సదస్సుకు వచ్చిన అతిథులకు గిఫ్ట్ ప్యాక్ లు!

  • విశాఖలో జీఐఎస్-2023
  • ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు
  • 8 వేల గిఫ్ట్ ప్యాక్ లు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు గుర్తుండిపోయేలా విశిష్ట కానుకలతో కూడిన గిఫ్ట్ ప్యాక్ లు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు వస్తువులను ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఉంచారు. ఇలాంటివి 8 వేల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం జీఐఎస్-2023 వేదిక వద్ద పంపిణీ చేస్తోంది.

ఈ గిఫ్ట్ ప్యాక్ లో కలంకారీ డిజైన్ తో కూడిన పింగాణీ ప్లేట్, నోట్ బుక్, పెన్నులు, తదితర వస్తువులతో పాటు, తిరుపతి లడ్డూను, అరకు కాఫీ, టీ పొడులు, గిరిజన తేనె కూడా అందిస్తున్నారు.

కాగా, గిఫ్ట్ లు అందనివారు కొందరు డెలిగేట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద రగడ సృష్టించారు. కొందరు అక్కడున్న తాత్కాలిక ఏర్పాట్లను చిందరవందర చేశారు.

Related posts

అది ఫేక్ వీడియో అంటారా ? … జగన్‌పై షర్మిల ఫైర్

Ram Narayana

అలా ఉపశమనం.. ఇలా ప్రత్యక్షం.. నరసరావుపేటకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి…

Ram Narayana

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’…సీఎం ఆదేశాలు …ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి !

Drukpadam