ఆంధ్రప్రదేశ్

కవితను 10 గంటలు విచారించిన ఈడీ అధికారులు

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ 

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • ఇప్పటికే కవితను ఓసారి ప్రశ్నించిన ఈడీ
  • నేడు రెండోసారి విచారణ
  • సుమారు 10 గంటల పాటు విచారణ
  • లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇవాళ సుదీర్ఘంగా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. కొద్దిసేపటి కిందటే కవిత విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు కవితను ప్రశ్నించారు. 
  • లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఉదయం ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు, ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Related posts

నిపుణులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న కెనడా

Drukpadam

తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్..!

Drukpadam

శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల నుంచి 1000కి పైగా కళాఖండాలు మాయం!

Drukpadam