ఆంధ్రప్రదేశ్

కవితను 10 గంటలు విచారించిన ఈడీ అధికారులు

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ 

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • ఇప్పటికే కవితను ఓసారి ప్రశ్నించిన ఈడీ
  • నేడు రెండోసారి విచారణ
  • సుమారు 10 గంటల పాటు విచారణ
  • లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇవాళ సుదీర్ఘంగా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. కొద్దిసేపటి కిందటే కవిత విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు కవితను ప్రశ్నించారు. 
  • లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఉదయం ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు, ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Related posts

డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి…. మంత్రి పొంగులేటి

Ram Narayana

కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలి …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్

Ram Narayana

ప్రధాని రిషి సునాక్ పై బ్రిటన్ ప్రజల విమర్శలు…

Drukpadam