బాబాయ్కి షాక్.. శరద్పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు.. ఎన్సీపీలో చీలిక!
-మహారాష్ట్రలో నిట్టనిలువునా చీలిన ఎన్సీపీ … బీజేపీ వ్యూహం సక్సెస్
-అజిత్ పవార్ ఆధ్వరంలో చీలికవర్గం నుంచి 29 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ..
-అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి
-ఆయన వర్గీయులకు మంత్రివర్గంలో చోటు
-అజిత్ పవార్ వెన్నుపోటుపై ఖంగు తిన్న మరాఠా యోధుడు శరద్ పవార్
ఆదివారం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి . శరద్ పవార్ అన్నకొడుకు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ షాక్ ఇచ్చారు .పార్టీని నిట్టనిలువునా చీల్చి తన వర్గం నాయకులతో అధికార బీజేపీ శివసేన పార్టీల నేతన్నలు కల్సి వారి మంత్రివర్గంలో చేరేందుకు సమ్మతి తెలిపారు . అందుకు వారు కూడా అంగీకరించారు . వెంటనే రాజ్ భవన్ లో గవర్నర్ చేత ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు . ఈ హఠాత్ పరిణామాలతో శరద్ పవార్ షాక్ తిన్నారు. అజిత్ పవార్ లో అసమ్మతి ఉన్నదని తెలిసిన ఆయనతో ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్లడం పెద్దాయనకు రుచించడంలేదు . పార్టీలనూ చీల్చి తమకు అణులంగా మార్చుకోవడంలో దిట్టగా ఉన్న బీజేపీ మరోసారి తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు ఎన్సీపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అజిత్ భవించారు . అయితే అందుకు విరుద్ధంగా శరద్ పవార్ తన కుమార్తె ఎంపీ సుప్రియసులేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు . దీంతో ఆయన అసమ్మతితో ఉన్నారు . నేడు ఆయన బీజేపీ ఆకర్ష్ లో పడిపోయారు …