Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి!

  • ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • గుజరాత్ నుంచి బాబూభాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ కు అవకాశం
  • బెంగాల్ నుంచి అనంత మహారాజ్ కు ఛాన్స్

రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా మరో మూడు స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్ నుంచి ఇద్దరు, పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరిని తమ అభ్యర్థులుగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి అనంత మహారాజ్, గుజరాత్ నుంచి బాబూభాయ్ జేసంగ్ భాయ్ దేశాయ్, కేశ్రీదేవ్ సిన్హ్ జాలాకు అవకాశం కల్పించింది.

ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 6 స్థానాలు, గుజరాత్ లో 3, గోవాలో 1 స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే గుజరాత్ నుంచి బీజేపీ తరపున నామినేషన్ వేశారు. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం.

Related posts

అసలు సుఖేష్ ఎవరు …కేసీఆర్ పై కక్షతోనే ఈనాటకమంతా …ఎమ్మెల్సీ కవిత !

Drukpadam

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…ఎంపీ నామ నాగేశ్వరరావు!

Drukpadam

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయం: ప‌వ‌న్ క‌ల్యాణ్!

Drukpadam

Leave a Comment