Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

టియుడబ్ల్యూజె ఐజెయులో ఖమ్మం జిల్లా నుంచి భారీ చేరికలు….!

టియుడబ్ల్యూజె ఐజెయులో ఖమ్మం జిల్లా నుంచి భారీ చేరికలు
ఖదీర్, సాగర్, కెవి. నాగేందర్ రెడ్డి, కెవి ,అంజయ్య సహా పలువురి చేరిక
జర్నలిస్టుల సంక్షేమం హక్కుల సాధనే లక్ష్యం : విరహత్అలీ
సుదీర్ఘ ఉద్యమచరిత్ర , పోరాటాల వారసత్వం ఉన్న సంఘంలో చేరడం అందంగా ఉన్నదన్న చేరిన నేతలు ..
ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మూడు పిల్లర్లు ఇటే వచ్చాయని వెల్లడి .

ఖమ్మం జిల్లాకు చెందిన టీజేఎప్, వివిధ సంఘాల నుంచి టీయూడబ్ల్యూజే(ఐజేయు) లో భారీగా చేరికలు జరిగాయి.. హైదరాబాద్ లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయం దేశోద్ధారక భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఖమ్మం నుంచి వెళ్లిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఐజేయులో చేరారు … వారందరిని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు సాదరంగా ఆహ్వానించి సంఘ సభ్యత్వం అందజేశారు ..

టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కె. విరహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా టియుడబ్ల్యూజె (ఐజేయు) పని చేస్తుందని స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలు పైబడిన ఉద్యమ చరిత్ర కలిగిన ఐజేయు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చిందని ఏనాడు రాజీ ధోరణిని ప్రదర్శించ లేదన్నారు. ఆదివారం హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమ లో ఖమ్మంజిల్లాకు చెందిన వివిధ జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద సంఖ్యలో వివిధ మీడియా ప్రతినిధులు టియుడబ్ల్యూజె (ఐజేయు) లో చేరారు. విరహత్ అలీ, కె. సత్యనారాయణ, రాష్ట్రం ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ సమక్షంలో వీరంతా యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విరాహత్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద సంఘంగా టియుడబ్ల్యూజె (ఐజేయు) తన ఖ్యాతిని నిలుపుకుంటుందన్నారు. మారిన పరిస్థితులలో జర్నలిస్టుల సమస్యల తీరు కూడా మారిందని నిరంతరం అధ్యయనం చేస్తూ సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ముందుకు సాగుతున్నామన్నారు. స్వ రాష్ట్రంలోనూ ఇండ్ల స్థలాల సమస్య, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆయన తెలిపారు. మండల స్థాయి నుంచి అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు నివాస స్థలం ఇవ్వాలని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా క్యాష్ లెస్ పద్దతిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులను అందించాలని ఐజెయు డిమాండ్ చేస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తూనే ఆందోళన కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగిందని విరహత్ అలీ తెలిపారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు రాం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐజయు సంఘానికి ఖమ్మం జిల్లా వెన్నెముఖలా నిలిచిందన్నారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొని బలియ శక్తిగా ఎదురులేని సంఘంగా నిలిచిందని ఈ నాడు చేరిన మిత్రులతో సంఘం మరింత బలోపేతమైందన్నారు. తమ పర అభిప్రాయానికి తావివ్వకుండా ఐక్యంగా ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా యూనియన్ లో చేరిన నేతలు మాట్లాడుతూ ఐజేయూ నాయకత్వంలో ఉన్న టీయూడబ్ల్యూజె లో చేరడం అందంగా ఉందని , విలువలు , పోరాటాలు తో హక్కులు సంధించిన సంఘంగా దీనికి పేరుందని అందువల్ల తాము సంఘం నిర్వహించే పోరాటాల్లో భాగస్వాముల మవుతామని అన్నారు ..

టియుడబ్ల్యూజె (ఐజెయు) లో చేరిన వారిలో వి6 ప్రతినిధి ఎండి ఖదీర్, దిశ బ్యూరో చీఫ్ దువ్వా సాగర్, ఏపీ24×7 ప్రతినిధి నాగేందర్రెడ్డి, వి5 రీజినల్ కో ఆర్డినేటర్ కొమ్మెర వెంకటేశ్వర్లు, విజయం సంపాదకులు పెండ్ర అంజయ్య, జి -తెలుగు బ్యూరో కొత్త యాకేష్, భారత్ టుడే ప్రతినిధి సంతోష్, సీనియర్ రిపోర్టర్ రాంచంద్రమూర్తి, జర్నలిస్ట్ సంపత్ తదితరులు ఈ సంఘంలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొంతు రమేష్ వైట్ల, విష్ణు దాస్ శ్రీకాంత్, శంకర్ గౌడ్, రాజేష్, టియుడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంద్రశేషు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, నాయకులు అయ్యప్ప తదితరులు ఉన్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

Drukpadam

సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…

Ram Narayana

ఖమ్మం లోకసభ పరిధిలో ఫిర్యాదులు ఉంటె తెలియజేయండి …ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డా. సంజయ్ గేండ్రాజ్ కోల్టే,

Ram Narayana

Leave a Comment