ఖమ్మం వార్తలు

మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి…పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి

మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి

  • ఉమ్మడి జిల్లా ప్రజలకు పొంగులేటి శీనన్న సూచన
  • ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు, సీపీకి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా

ఖమ్మం: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ఖమ్మం కలెక్టర్ వీపీ. గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ కు ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల వెంబడి వరద తాకిడితో ఎలాంటి నష్టం జరగకుండా అక్కడి అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ.. వరద సహాయక చర్యలను చేపట్టాలని అన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఖ్య పెంచుకుని.. మెరుగైన సేవలు అందేలా చూడాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతిఒక్కరినీ అప్రమత్తం చేయాలని కోరారు.

Related posts

పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్..

Ram Narayana

పేదల గుడిసెల కూల్చివేత నిరంకుశత్వానికి నిదర్శనం మాజీ మంత్రి పువ్వాడ అజయ్

Ram Narayana

అభ్యుదయ సాహిత్యంతో సమాజ మార్పు..కెవిఎల్

Ram Narayana