- ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం
- సోదరి పార్టీలో చేరబోతున్న సునీత
- పులివెందుల శాసనసభ లేదా కడప లోక్ సభకు పోటీ చేసే అవకాశం
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోబోతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్నారు. తన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా నియమితులు కావడంతో సునీత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయంచుకున్నారు.
పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి శాసనసభకు లేదంటే కడప నుంచి లోక్ సభకు పోటీ చేయాలని సునీత భావిస్తున్నట్టు సమాచారం. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన కోర్టు కేసుల్లో సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి కఠిన శిక్షలు పడాలని ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. వైసీపీ టార్గెట్ గా ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నారు.
నారా లోకేశ్ ను కలిసిన విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్
- త్వరలో ఏపీలో ఎన్నికలు
- రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
- టీడీపీలో చేరనున్న బొప్పన భవకుమార్
![Boppana Bhava Kumar met Nara Lokesh](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2024/01/image-65.jpeg?resize=691%2C461&ssl=1)
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా, విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన లోకేశ్ తో భేటీ అయ్యారు. భవకుమార్ వెంట కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ కూడా ఉన్నారు.
భవకుమార్ నేడు నారా లోకేశ్ ను కలవకముందే వంగవీటి రాధా, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ లతో చర్చించారు. భవకుమార్ గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమిపాలయ్యారు. భవకుమార్ త్వరలోనే తన అనుచర గణంతో టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.