తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ, ఏపీలకు ఐపీఎస్ ల కేటాయింపు

  • తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్ ల కేటాయింపు
  • ఏపీకి ముగ్గురు అధికారుల కేటాయింపు
  • వీరంతా 2022 బ్యాచ్ కు చెందిన అధికారులు

ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు. వీరంతా 2022 బ్యాచ్ కు చెందినవారు. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో సాయి కిరణ్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయి, మంధారే సోహం సునీల్, ఆయేషా ఫాతిమా, మనన్ భట్ ఉన్నారు. ఏపీకి కేటాయించిన అధికారుల పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో పర్యటించినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని ఈ సందర్భంగా అమిత్ షాను రేవంత్ కోరారు.

Related posts

తెలుగు రాష్ట్రాల్లో విషాదం … 9 మంది జలసమాధి

Ram Narayana

కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్.. ప్రైవేట్ బస్సులంటేనే జంకుతున్న జనం..

Ram Narayana

చేతికి బ్యాండేజ్ పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Ram Narayana