Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మాజీమంత్రి బీఆర్ యస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అరెస్ట్…

మాజీమంత్రి బీఆర్ యస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు …తన కాలేజీ పక్కనే ఉన్న భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి ఆయన అల్లుడిపై ఆరోపణలు ఉన్నాయి…గతంలో ప్రొక్లైన్ల సహాయంతో కాలేజీ లోని కొన్ని భవనాలు కూల్చారు …తాజాగా మల్లారెడ్డి స్థలాలు ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ..ఆయన అల్లుడు ,కుమారుడిపై కూడా కేసులు పెట్టారు ..ఈసందర్భంగా మల్లారెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు..

హైదరాబాద్​లోని సుచిత్ర పరిధి సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన అనుచరులతో పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చి వేయించారు. ఇంతలోనే ఘర్షణ జరుగుతున్న భూమి తమదేనంటూ 15 మంది ఘటనా స్థలికి వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం తమ భూమిపై కాంగ్రెస్ నాయకులు కొన్నేళ్లుగా కబ్జా చేయాలని చూస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Related posts

ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు కుదిరిన పెళ్లి.. విద్యార్థి ఆత్మహత్య!

Drukpadam

చెక్ బౌన్స్ వివాదం.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కాంగ్రెస్ నేతలు…

Drukpadam

భర్త, అత్త ప్రాణాలు తీసి, ముక్కలు చేసిన ఇల్లాలు…

Drukpadam

Leave a Comment