Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్…

  • దేశంలో ఈసారి ఏడు దశల్లో పోలింగ్
  • నేడు చివరి విడత పోలింగ్
  • సాయంత్రం 6 గంటలకు ముగిసిన ఓటింగ్
  • సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. ఈసారి దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా, నేడు చివరిదైన ఏడో దశ పోలింగ్ నిర్వహించారు. 

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్ నమోదైంది. 

చివరి దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అదే సమయంలో ఒడిశా అసెంబ్లీలో 42 స్థానాలకు కూడా పోలింగ్ జరిపారు. కాగా, అన్ని దశలకు కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Related posts

ప్రచారంలో హద్దుమీరవొద్దు.. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక

Ram Narayana

ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగేదిలా..!

Ram Narayana

ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ టూర్

Ram Narayana

Leave a Comment