Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తెలంగాణాలో మండలి ఉనికికి ప్రమాదం …సీఎంల భేటీలో చర్చించండి …మాజీఎంపీ వినోద్

  • తెలంగాణలో మండలి ఉనికి ప్రమాదంలో పడిందన్న వినోద్ కుమార్
  • తెలంగాణలో 153కు, ఏపీలో 225కు అసెంబ్లీ సీట్లను పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • చంద్రబాబుతో రేవంత్ మాట్లాడి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేలా చూడాలని విజ్ఞప్తి

ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో కీలకంగా ఉన్నారని… శనివారం నాటి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు కృషి చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో శాసనమండలి ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. మండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు.

మండలిలో కనీసం 40 సీట్లు ఉండాలని, అంతకంటే తక్కువ ఉండకూడదన్నారు. కానీ కేంద్రం గత టర్మ్‌లో చేసిన రాజ్యాంగ సవరణతో మండలి ఉనికి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ టర్మ్ ముగిసే వరకు ఆంగ్లో ఇండియన్‌ పదవీ కాలం ఉందని, దీంతో గత అసెంబ్లీ సమయం ముగిసే వరకు ఎలాంటి ముప్పు రాలేదన్నారు.

కేంద్రం చేసిన సవరణ కొత్త అసెంబ్లీ నుంచి అమల్లోకి వచ్చిందని… ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ సభ్యుడు అసెంబ్లీలో లేరన్నారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 119గానే ఉందన్నారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 40 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉల్లఘించినట్లుగా అవుతుందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే మండలి రద్దయ్యే అవకాశం ఉందన్నారు.

మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. విభజన చట్టం 26 సెక్షన్ ప్రకారం తెలంగాణలో 153కు, ఏపీలో 225కు అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందన్నారు. గతంలో అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదన్నారు. కానీ జమ్మూ కశ్మీర్‌ లో అసెంబ్లీ సీట్లను పెంచారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే విధంగా చూసి తెలంగాణ మండలి కొనసాగే విధంగా చూడాలని కోరారు. శాసన మండలి అవసరమని, పార్లమెంట్‌లో బిల్లు వచ్చిననాడు తాను సుదీర్ఘంగా ప్రసంగించానని గుర్తు చేశారు. శాసన మండలిని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు.

Related posts

చంద్రబాబుకు మద్దతుగా వేలాదిగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు.. విప్రో సర్కిల్ వద్ద ఉద్రిక్తత

Ram Narayana

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు..!

Ram Narayana

Leave a Comment