Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నీట్ సవరించిన ఫలితాలపై అయోమయం… స్పష్టత నిచ్చిన విద్యాశాఖ…

  • నేడు నీట్ ఫలితాలు విడుదలైనట్టు వార్తలు
  • ఎన్టీయే వెబ్ సైట్ లో ఓపెన్ కాని లింకు
  • వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని విద్యాశాఖ వెల్లడి
  • త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టీకరణ

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు నీట్ యూజీ తుది ఫలితాలను ఎన్టీయే విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. నీట్ సవరించిన ఫలితాలు (నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డ్) పేరిట ఓ లింక్ ఎన్టీయే వెబ్ సైట్ లో కనిపించడంతో… అందరూ ఫలితాలు విడుదలయ్యాయనే అనుకున్నారు. అయితే ఈ లింకు ఓపెన్ కాకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. 

దాంతో కేంద్ర విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఎన్టీయే వెబ్ సైట్లో ఉన్నది పాత లింకు అని, ఆ లింక్ చూసి స్కోర్ కార్డ్ లు ప్రకటించినట్టుగా భావించారని పేర్కొంది. సవరించిన స్కోర్ కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

Related posts

ఇక సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు!

Ram Narayana

బీజేపీ ఓటమి నేపథ్యంలో రాజీనామా సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై….

Drukpadam

మహా కుంభమేళాకు 50 కోట్లు దాటిన భక్తులు… ఆ ఒక్కరోజే 8 కోట్ల భక్తుల పుణ్యస్నానాలు!

Ram Narayana

Leave a Comment