జాతీయ వార్తలు

అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ సీఎం స్పందన

వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని వారం రోజుల కిందటే కేరళను హెచ్చరించామని, కానీ తగిన చర్యలు తీసుకోవడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాజ్యసభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కేరళ సీఎం విజయన్ స్పందించారు.

ఇది నిందలు మోపుకునే సమయం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి (అమిత్ షా) చెప్పిన కొన్ని అంశాలు నిజమేనని, కొన్ని మాత్రం అవాస్తవాలని విజయన్ స్పష్టం చేశారు.

“వయనాడ్ ప్రజలు కొండచరియలు విరిగిపడిన ఘటనతో తీవ్ర విషాదానికి గురై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి తెరలేపాలని అనుకోవడంలేదు. వాస్తవం ఏంటంటే… వయనాడ్ లో కొండచరియలు విరిగిపడొచ్చన్న అంచనాలు మాత్రం వెలువడ్డాయి.. అయితే ఆ అంచనాలు రెడ్ అలెర్ట్ స్థాయిలో ఉన్నాయని ప్రస్తావించలేదు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రెడ్ అలెర్ట్ సందేశం వచ్చింది. అప్పటికి కొన్ని గంటల ముందే విపత్తు సంభవించింది. ఐఎండీ వెలువరించిన అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో మీది తప్పంటే మీది తప్పని వాదనలు చేయలేం” అని సీఎం విజయన్ వ్యాఖ్యానించారు.

Related posts

స్వాతంత్ర దినోత్సవ వేళ కుట్ర భగ్నం.. డీఆర్‌డీఓలో పట్టుబడ్డ పాక్ గూఢచారి

Ram Narayana

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల విడుదల… రాజస్థాన్ డాక్టర్ కు టాప్ ర్యాంక్…

Ram Narayana

గడ్కరీ మనస్సులో మాట కుండబద్దలు …ఢిల్లీకి రావాలంటే విసుగు అన్న కేంద్ర మంత్రి!

Ram Narayana