Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!


ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు ఈ మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. ఆయన వెంట చంద్రదండు కార్యకర్తలు కూడా నడిచారు. 

చంద్రబాబు కాలినడకన రైలు వంతెన పైకి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే, ఓ రైలు ఎదురుగా వచ్చింది. దాంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కేవలం మూడు అడుగుల సమీపం నుంచి రైలు వెళ్లింది.

చంద్రబాబు ట్రాక్ కు కొంచెం పక్కగా నిలబడడంతో ప్రమాదం తప్పినట్టుయింది. రైలు తనకు తగలకుండా చంద్రబాబు వంతెనపై ఎంతో జాగ్రత్తగా నిలుచుకున్నారు. చంద్రబాబు సేఫ్ గా ఉండడంతో అధికారులు, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ ‘ఆజాదీ మార్చ్’పై పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు..

Drukpadam

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

Ram Narayana

సీఎం జగన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో బ్లేడుతో మణికట్టు కోసుకున్న మహిళ!

Drukpadam

Leave a Comment