Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నందిగం సురేశ్ కు పోలీస్ కస్టడీ విధించిన మంగళగిరి కోర్టు!

  • టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం అరెస్ట్
  • ప్రస్తుతం గుంటూరు జిల్లాలో జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ
  • నందిగం సురేశ్ ను జైలులోనే విచారించనున్న పోలీసులు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు మంగళగిరి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్ ను ఇటీవల మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, మంగళగిరి కోర్టు నందిగం సురేశ్ ను రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం నందిగం సురేశ్ గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు జైలులోనే విచారించనున్నారు. 

ఈ కేసులో నందిగం సురేశ్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. నందిగం సురేశ్ ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Related posts

రష్యాకు షాక్.. ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్!

Drukpadam

బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు

Drukpadam

పాదయాత్రలో కల్లుతాగిన వైయస్ షర్మిల….

Drukpadam

Leave a Comment