Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఝార్ఖండ్ ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా డిప్యూటీ సీఎం భట్టిని నియమించిన ఏఐసీసీ …

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మహారాష్ట్రలో… ఏఐసీసీ కీలక బాధ్యతలు

  • మహా అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా నియమించిన ఏఐసీసీ
  • ఝార్ఖండ్‌ లో పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ

తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలకు ఏఐసీసీ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ అబ్జర్వర్లుగా వారిని నియమించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.

మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మందిని నియమించగా… ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక, ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని పరిశీలకులుగా నియమించారు.

Related posts

రాజ్యసభలో మెజారిటీ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ…

Ram Narayana

అగ్నివీర్‌ పథకాన్ని చెత్తబుట్టలో వేస్తా: రాహుల్ గాంధీ

Ram Narayana

చిదంబరం ఆధ్వర్యంలో 2024 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ

Ram Narayana

Leave a Comment