జాతీయ వార్తలు

ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్!


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో అలర్టయిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఓ మహిళ (34) ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీని చంపేందుకు ప్లాన్ సిద్ధం చేశామని తెలిపింది. ఇప్పటికే ఆయుధం కూడా రెడీ చేశామని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Related posts

ఎల్‌టీటీఈ మహిళకు భారత ఓటర్ ఐడీ.. ఈసీని అప్రమత్తం చేసిన ఈడీ!

Ram Narayana

కొత్తతరం జడ్జీలకు పెను సవాలుగా సోషల్ మీడియా: జస్టిస్ అభయ్ ఓకా

Ram Narayana

ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డ్రోన్లు ఉపయోగించారు : గౌతమ్ అదానీ

Ram Narayana