జాతీయ వార్తలు

ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్!


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో అలర్టయిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఓ మహిళ (34) ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీని చంపేందుకు ప్లాన్ సిద్ధం చేశామని తెలిపింది. ఇప్పటికే ఆయుధం కూడా రెడీ చేశామని చెప్పింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Related posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Ram Narayana

రాజకీయాల్లోకి విజయ్.. నటుడిగా ఆ సినిమానే చివరిది!

Drukpadam

పాక్ పై పక్కా ఆధారాలతో ఐరాసకు బృందాన్ని పంపిస్తున్న భారత్!

Ram Narayana