- అరగంటకు పైగా ఇరువురి భేటీ
- ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశంపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అరగంటకు పైగా వీరు భేటీ అయ్యారు. ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.