Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం!

  • ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన అడిషనల్ డీసీపీ బాబ్జి 
  • హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన
  • మార్నింగ్ వాక్ చేస్తూ ప్రమాదానికి గురైన వైనం

హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్ అధికారి మృతి చెందారు. లక్ష్మారెడ్డిపాలెం మైత్రీ కుటీర్‌లో నివాసముంటున్న అడిషనల్ డీసీపీ బాబ్జి, ప్రతిరోజూ మాదిరిగానే శనివారం కూడా వేకువజామున మార్నింగ్ వాక్‌కు వెళ్లారు.

ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా, అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Related posts

యూఎస్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు భార‌తీయుల దుర్మ‌ర‌ణం!

Ram Narayana

కెనడాలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో తిరబడ్డ విమానం ప్రయాణికులకు గాయాలు …

Ram Narayana

థానే రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..

Ram Narayana

Leave a Comment