MLC Kavitha
తెలంగాణ వార్తలు

అది కాళేశ్వరం క‌మిష‌న్ కాదు.. కాంగ్రెస్ క‌మిష‌న్ … ఎమ్మెల్సీ క‌విత‌

ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన‌ ప్రజానాయకుడు కేసీఆర్‌కు రాజ‌కీయ దురుద్దేశంతో, కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. అది కాళేశ్వరం క‌మిష‌న్ కాదు… కాంగ్రెస్ క‌మిష‌నని మ‌రో సారి తేట‌తెల్లమైందని పేర్కొన్నారు. “ కాళేశ్వరం ప్రజా ప్రయోజ‌నాల‌ కోసం నిర్మించిన‌ బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయి. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”  అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు.  

Related posts

వనజీవి చిరకాల కోరికలు తీరుస్తాం – మంత్రి పొంగులేటి

Ram Narayana

ఇజ్రాయెల్‌లో తెలంగాణ వ్య‌క్తి మృతి .. బాంబుల మోతకు ఆగిన‌ గుండె!

Ram Narayana

ఏకగ్రీవం చేస్తే.. రూ.25 లక్షలిస్తా..!

Ram Narayana