MLC Kavitha
తెలంగాణ వార్తలు

అది కాళేశ్వరం క‌మిష‌న్ కాదు.. కాంగ్రెస్ క‌మిష‌న్ … ఎమ్మెల్సీ క‌విత‌

ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన‌ ప్రజానాయకుడు కేసీఆర్‌కు రాజ‌కీయ దురుద్దేశంతో, కుట్ర పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. అది కాళేశ్వరం క‌మిష‌న్ కాదు… కాంగ్రెస్ క‌మిష‌నని మ‌రో సారి తేట‌తెల్లమైందని పేర్కొన్నారు. “ కాళేశ్వరం ప్రజా ప్రయోజ‌నాల‌ కోసం నిర్మించిన‌ బృహత్ ప్రాజెక్టు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు. తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం. రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయి. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”  అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు.  

Related posts

అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది … శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగులేదు…సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

Ram Narayana

20 ఏళ్ల తరువాత ఓయూకు సీఎం… సమస్యల పరిష్కారంపై విద్యార్థుల ఆశలు…

Ram Narayana