ఆంధ్రప్రదేశ్ప్రమాదాలు ...

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో విషాదం: లోయలో పడిన యాత్రికుల బస్సు.. 8 మంది యాత్రికులు దుర్మరణం

  • అల్లూరి జిల్లాలో యాత్రికుల బస్సు బోల్తా
  • చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలో పడ్డ బస్సు
  • భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఘటన
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన 35 మంది యాత్రికులు, ఇద్దరు డ్రైవర్లతో ఓ ప్రైవేటు బస్సు భద్రాచలంలో దర్శనం ముగించుకుని అన్నవరం బయలుదేరింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్ట వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో యాత్రికుల బంధువుల స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Andhra Pradesh CM Chandrababu Responds to Alluri Bus Tragedy

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్డుపై శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యాత్రికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించామని, వీరిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ప్రధాని మోదీ పరిహారం ప్రకటన

PM Modi announces Rs 2 lakh ex gratia for kin of victims in Andhra bus tragedy

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ‌ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఆర్థిక సహాయం ప్రకటించారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన 37 మంది యాత్రికులు ఓ ప్రైవేటు బస్సులో భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం బయలుదేరారు. చింతూరు-నరెడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న భద్రతా గోడను ఢీకొని లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చ‌నిపోయారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల అటవీ ప్రాంతం కావడంతో అక్కడ మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారం అధికారులకు ఆలస్యంగా చేరింది. విషయం తెలుసుకున్న మోతుగూడెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసి, క్షతగాత్రులను ఐదు పోలీస్ వాహనాలు, మూడు అంబులెన్సుల సహాయంతో చింతూరులోని ఆసుపత్రికి తరలించారు.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Govt Announces Ex Gratia for Bus Accident Victims

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది.

ప్రమాద ఘటనపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చింతూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. పరిహార మొత్తాలను వీలైనంత త్వరగా అందజేస్తాం” అని హామీ ఇచ్చారు.

మంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను కఠినతరం చేయాలని రవాణా శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

Related posts

రాయి దాడి నేపథ్యంలో.. జగన్ కు భద్రత భారీగా పెంపు

Ram Narayana

భార్యతో విడాకులు మంజూరు చేయాలని ఒమర్ అబ్దుల్లా పిటిషన్.. హైకోర్టు కీలక తీర్పు

Ram Narayana

మీరు పీఎం కిసాన్ ఈ-కేవైసీ చేయించారా…?లేకపోతె చేయించండి …

Drukpadam