అంతర్జాతీయం

అగ్రనేతపై దాడి చేస్తే యుద్ధమే.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన
  • ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలు
  • 5000 దాటిన మృతుల సంఖ్య
  • ఇరు దేశాల నేతల మధ్య తీవ్రస్థాయికి చేరిన మాటల యుద్ధం

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీపై ఎలాంటి దాడి జరిగినా దానిని ఇరాన్ జాతిపై సంపూర్ణ యుద్ధంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదివారం ‘X’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పెజెష్కియాన్, తమపై ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. “మా దేశ గొప్ప నాయకుడిపై దాడి చేయడం అంటే ఇరాన్ జాతితో సంపూర్ణ యుద్ధానికి దిగడమే” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 5000 మందికి పైగా మరణించినట్లు ఇరాన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. మృతుల్లో సుమారు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ మరణాలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపించగా, ట్రంప్ మాత్రం ఇరాన్ నాయకత్వాన్ని తప్పుబడుతున్నారు. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Related posts

చంద్రయాన్-3 కథ ఇక ముగిసినట్టే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై ఆశలు వదిలేసుకున్న ఇస్రో

Ram Narayana

అమెరికాలో హరికేన్ విధ్వంసం.. 4 రాష్ట్రాల్లో 45 మంది మృతి!

Ram Narayana

పాక్ సైనిక పాలకుడు ముషారఫ్ కు ‘మరణానంతరం మరణ శిక్ష’!

Ram Narayana