జాతీయ వార్తలుబిజినెస్ వార్తలు

వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.3,071..రూ.993 పెంపు..

  • ఢిల్లీలో రూ.3,071కి చేరిన 19 కేజీల సిలిండర్ ధర
  • గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో లేని మార్పు 
  • హోటళ్లు, రెస్టారెంట్లపై గణనీయంగా పెరగనున్న నిర్వహణ వ్యయం
  • అంతర్జాతీయ పరిణామాలే ధరల పెంపునకు కారణం

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు నేటి నుంచి (మే 1) 2026 అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.3,071.50కి చేరింది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ధరల ప్రభావం అధికంగా ఉంటోంది.

ఈ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరగనుంది. పెరిగిన ఈ భారాన్ని వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉందని, ఫలితంగా బయట ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి వాణిజ్య సిలిండర్‌పై ధర పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

మరోవైపు, అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూ గృహ వినియోగ ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్రం యథాతథంగా ఉంచింది. విమానయాన ఇంధనం (ATF) ధరల్లో కూడా మార్పు చేయలేదు. చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి. తదుపరి సమీక్ష జూన్ 1న జరగనుంది.

Related posts

బెంగళూరు మహిళా టెక్కీ మృతిలో సంచలన మలుపు…

Ram Narayana

అయోధ్య కు .. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు

Ram Narayana

రూ.1,279కే టికెట్.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్రీడమ్ సేల్’

Ram Narayana