అంతర్జాతీయం

ఇరాన్ యుద్ధం నుంచి వైదొలుగుదాం.. ట్రంప్‌పై సలహాదారుల ఒత్తిడి!

  • రాజకీయ వ్యతిరేకత తీవ్రమవుతుందనే భయమే కారణం
  • అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం
  • సామాన్యుడిపై ఆర్థిక భారం వల్ల ట్రంప్ పై వ్యతిరేకత

ఇరాన్‌ తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. యుద్ధాన్ని సాగదీయడం వల్ల రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భయపడుతున్న ఆయన సలహాదారులు.. యుద్ధం నుంచి వెంటనే వైదొలగాలని (ఎగ్జిట్ ప్లాన్) ట్రంప్‌ పై ఒత్తిడి పెంచుతున్నారు. సలహాదారుల ఆందోళనకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

రాజకీయ వ్యతిరేకత:
యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ఇది రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి దెబ్బ కొడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఆకాశాన్నంటుతున్న ధరలు:
చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్యుడిపై పడుతున్న ఈ ఆర్థిక భారం ట్రంప్ పాపులారిటీని దెబ్బతీస్తోంది.

ట్రంప్ ఏమంటున్నారంటే..
సలహాదారుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం బయటపడకుండా తనదైన శైలిలో స్పందించారు. ‘‘మేము షెడ్యూల్ కంటే ముందే ఉన్నాం. మిలిటరీ పరంగా సాధించాల్సిన లక్ష్యాలను దాదాపుగా పూర్తి చేశాం. ఈ యుద్ధం చాలా త్వరగా ముగిసిపోతుంది’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ‘‘సంతృప్తికరమైన విజయం’’ సాధించకుండా ఆయన వెనక్కి తగ్గేలా కనిపించడంలేదని మరికొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్ కొత్త నేతతో సవాల్..
ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్‌గా హార్డ్‌లైనర్ మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒకవేళ ఆయన తమ డిమాండ్లకు లొంగకపోతే, ఆయనపై కూడా దాడులు చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

బందీలను విడిచిపెట్టండి.. లేదంటే నరకం చూస్తారు.. హమాస్‌కు ట్రంప్ హెచ్చరిక!

Ram Narayana

ట్రంప్ నిర్ణయాలపై వారెన్ బఫెట్ ఆందోళన!

Ram Narayana

ఉక్రెయిన్, రష్యా వార్ .. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన…

Ram Narayana