బిజినెస్ వార్తలు

ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో భారత్ హవా.. మూడో స్థానంలో 229 మంది…

ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2026 సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 229 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో నిలిచి తన సత్తాను చాటింది. ఇటీవల విడుదలైన ఈ నివేదిక ప్రకారం అమెరికాలో 989 మంది, చైనాలో 610 మంది కుబేరులు ఉన్నట్లు వెల్లడైంది.

గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 390 మంది ఈ జాబితాలో చేరడంతో మొత్తం కుబేరుల సంఖ్య 3,400 దాటింది. అంటే సగటున రోజుకు ఒకరు బిలియనీర్‌గా మారారన్నమాట. భారత్ తర్వాత జర్మనీ (212), రష్యా (147) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల నుంచి కూడా తొలిసారిగా బిలియనీర్లు చోటు దక్కించుకోవడం విశేషం.

ఈ జాబితాలో యువత సత్తా చాటడం మరో ముఖ్యమైన అంశం. భారత సంతతికి చెందిన 22 ఏళ్ల సూర్య మిధా, స్వశక్తితో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా రికార్డు సృష్టించారు. తన స్నేహితులతో కలిసి స్థాపించిన ‘మెర్కార్’ అనే ఏఐ రిక్రూటింగ్ టూల్ అతడిని ఈ స్థాయికి చేర్చింది. బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల అమెలీ వోయిగ్ట్ ట్రెజెస్ వారసత్వ సంపదతో ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన బిలియనీర్‌గా నిలిచారు.

వీరితో పాటు పలువురు ప్రముఖ సెలబ్రిటీలు కూడా 2026లో బిలియనీర్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. వీరిలో అమెరికన్ పాప్ సింగర్ బెయాన్సే, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, ర్యాపర్ డాక్టర్ డ్రే, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ వంటి వారు ఉన్నారు.

Related posts

చెక్కుల క్లియరెన్స్ పై ఆర్బీఐ కొత్త విధానం!

Ram Narayana

రేపు బ్యాంకుల సమ్మె… స్తంభించనున్న పలు సేవలు!

Ram Narayana

ప్రపంచంలో మరే దేశానికీ సాధ్యం కాని పని భారత్ చేసి చూపించింది: మాక్రాన్

Ram Narayana