జాతీయ వార్తలు

దేశంలో రెండు రోజులు ఈద్.. కేరళలో నేడు, మిగతాచోట్ల రేపు!

భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ పండుగ ఈసారి రెండు వేర్వేరు తేదీల్లో జరగనుంది. కేరళలో ముస్లింలు శుక్రవారం పండుగ జరుపుకుంటుండగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో శనివారం వేడుకలు నిర్వహించనున్నారు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం శవ్వాల్ నెలవంక కనిపించడంలో తేడాలే ఈ వ్యత్యాసానికి కారణం.

కేరళలోని పలు తీరప్రాంతాల్లో గురువారం సాయంత్రం నెలవంక కనిపించడంతో, శుక్రవారమే ఈద్ జరుపుకోవాలని స్థానిక మత పెద్దలు ప్రకటించారు. అయితే, ఢిల్లీతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో గురువారం నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లింలు శుక్రవారం రంజాన్ మాసపు 30వ ఉపవాసాన్ని పూర్తి చేసి, శనివారం నాడు ఈద్ వేడుకల్లో పాల్గొననున్నారు.

ముస్లింలు అనుసరించే హిజ్రీ క్యాలెండర్ చంద్రుడి గమనంపై ఆధారపడి ఉంటుంది. భౌగోళిక ప్రాంతం, వాతావరణ పరిస్థితుల వల్ల నెలవంక కనిపించే సమయం మారడం సహజం. అందుకే తేదీల్లో ఇలాంటి తేడాలు వస్తుంటాయి. తేదీలు వేరైనా పండుగ ఇచ్చే సందేశం మాత్రం ఒక్కటేనని ఫతేపురి మసీదు ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ తెలిపారు. “ఈ పండుగ సందర్భంగా దేశంలో సోదరభావం, సామరస్యం పెరగాలని ప్రార్థిస్తున్నాం” అని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భద్రతా కారణాలతో కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ఈద్ ప్రార్థనలపై ఆంక్షలు విధించారు. ప్రార్థనలను మసీదులకే పరిమితం చేయాలని అధికారులు సూచించారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

Related posts

గోవా నైట్ క్లబ్ యజమానులు థాయ్ లాండ్ లో అరెస్ట్…

Ram Narayana

కుంభమేళాలో 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు: యూపీ ప్రభుత్వం

Ram Narayana

శుభాంశు శుక్లా ప్రయాణం ప్రారంభం .. ఫాల్కన్ 9 టేకాఫ్ సక్సెస్

Ram Narayana