Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం.. ఇద్దరు కూలీల మృతి

  • సెంట్రింగ్ కర్రలు విరగడంతో ఆరో అంతస్తు నుంచి కిందపడ్డ కూలీలు
  • తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం
  • మరో ఇద్దరు కూలీల పరిస్థితి విషమం

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో గురువారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రింగ్ కోసం పెట్టిన కర్రలు విరిగిపోవడంతో పలువురు కూలీలు ఆరో అంతస్తు నుంచి కిందపడ్డారు. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్ బీ కాలనీలోని అడ్డగుట్టలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారు బీహార్ కు చెందిన సంతు బట్నాయక్, సోనియా చరణ్ లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు కూలీలను ఆసుపత్రికి తరలించామని, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. కాగా, భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవన నిర్మాణంలో భాగంగా జీ 4 కు అనుమతులు తీసుకుని, జీ 5 నిర్మిస్తున్నట్లు సమాచారం.

Related posts

తెలంగాణ ఎన్నికల్లో డాక్టర్ల హవా

Ram Narayana

నల్లగొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో గందరగోళం …బీఆర్ యస్ నిరసన

Ram Narayana

ప్రియుడిని పెళ్లి చేసుకున్న కూతురు.. తన ఆవేదనను ఫ్లెక్సీ ద్వారా తెలిపిన తండ్రి..

Ram Narayana

Leave a Comment