Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

చావనైనా చస్తాను కానీ… నాకు ఇది కావాలి అంటూ పార్టీ వద్దకు వెళ్లను: శివరాజ్ సింగ్ చౌహాన్

  • మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ
  • అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు
  • అనూహ్య రీతిలో మోహన్ యాదవ్ ను సీఎంగా ప్రకటించిన బీజేపీ
  • నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ ప్రస్థానానికి తెర
Shivraj Singh Chouhan said he will never ask party for himself

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ ప్రస్థానం సాగించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఈసారి ఆ భాగ్యం దక్కలేదు. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారం నిలబెట్టుకున్నప్పటికీ… బీజేపీ హైకమాండ్ మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దాంతో నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్థానానికి తెరపడింది. 

ఇవాళ చౌహాన్ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. అనంతరం పలువురు మహిళలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగాలకు లోనయ్యారు. చావనైనా చస్తాను కానీ…  నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగడానికి ఢిల్లీ వెళ్లను అని స్పష్టం చేశారు. అలాంటివి నాకు నచ్చవు అని ఉద్ఘాటించారు. 

ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత శివరాజ్ సింగ్ ఢిల్లీ వెళ్లడానికి బదులు చింద్వారా వెళ్లారు. చింద్వారా ప్రాంతంలో బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తన చర్య ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

Related posts

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషలు ఎత్తివేసే కుట్ర …సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ..

Ram Narayana

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం …ఇండియా కూటమిపై ప్రభావం చూపదన్న కేజ్రీవాల్ ..

Ram Narayana

అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు.. ముఖానికి సబ్బు కూడా వాడను: రాహుల్ గాంధీ ఆసక్తికర ముచ్చట్లు

Ram Narayana

Leave a Comment