తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉగాది తర్వాత జనంలోకి గులాబీ బాస్ ….

రంగంలోకి కేసీఆర్.. ఉగాది తర్వాత రోడ్‌షోలతో జనంలోకి

  • లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్
  • రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్రణాళిక
  • హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీకాంత్!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొనాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం 17 నియోజకవర్గాలను చుట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతోపాటు క్యాడర్‌‌లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్‌షో నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగులో పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్‌ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.

Related posts

మేము బీఆర్ యస్ కు ఎప్పుడు అంటకాగలేదు …కూనంనేని..

Ram Narayana

రేవంత్ రెడ్డి సర్కార్ లో మాదిగలకు తీరని అన్యాయం …మంద కృష్ణ మాదిగ ధ్వజం

Ram Narayana

ఒవైసీ బ్రదర్స్ సువిశాల నిర్మాణాల్ని మాత్రం రేవంత్ రెడ్డి కూల్చడం లేదు: బీజేపీ నేత

Ram Narayana