Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

  • బెయిల్ పిటిషన్లపై నిన్న వాదనలు వినిపించిన కవిత తరఫు లాయర్లు 
  • నేడు వాదనలు వినిపించిన దర్యాఫ్తు సంస్థలు
  • బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు దర్యాఫ్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

Related posts

అలా అయితే భారత్ నుంచి నిష్క్రమిస్తాం.. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టీకరణ…

Ram Narayana

హిందూ వివాహంలో కన్యాదానం తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

క‌విత బెయిల్ పిటిష‌న్ల‌పై ఢిల్లీ హైకోర్టులో విచార‌ణ రేప‌టికి వాయిదా…

Ram Narayana

Leave a Comment