Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జై షా

  • టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
  • టీమిండియాపై అభినందనల వెల్లువ
  • టీమిండియా బృందానికి తియ్యని కబురు చెప్పిన జై షా

ఐసీసీ టైటిళ్ల కరవు తీర్చుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో చాంపియన్స్ గా అవతరించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా, బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియాకు రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని జై షా స్వయంగా వెల్లడించారు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతమైన ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి కనబర్చిందని కొనియాడారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, ఇతర సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జై షా పేర్కొన్నారు. టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.

Related posts

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన.. జట్టులో స్థానం ఎవరెవరికి దక్కిందంటే..!

Ram Narayana

టీ20 వరల్డ్ కప్ విజయం.. ఫ్యాన్స్ మనసుకు హత్తుకునేలా రోహిత్ శర్మ పోస్టు…

Ram Narayana

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపు బోణీ..!

Ram Narayana

Leave a Comment